తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం కోసం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా అందుబాటులో ఉన్న మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంఓ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొంటారు. మరోవైపు బడ్జెట్-2022 సమావేశాలను 10 రోజులకుపైగా నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. బడ్జెట్ కసరత్తు, సమావేశాల్లో చర్చించే అంశాలపై కూడా నేడు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ