పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఆరోదశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 3.30 గంటల వరకు 70.12 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మరోవైపు ఆరో దశ సందర్భంగా పలు పోలింగ్ కేంద్రాల వద్ద టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య చెదురుముదురు సంఘటనలు చోటు చేసుకున్నాయి.
–> ఈ దశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం నాడు పోలింగ్ జరుగుతుండగా, అన్ని పార్టీల నుంచి 306 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.03 కోట్లకు పైగా ప్రజలు ఈదశలో తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా, సాయంత్రం 6.30 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ పక్రియ కోసం మొత్తం 14,480 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు.
–> మరోవైపు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర, స్థానిక బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక నార్త్ దినజ్పూర్, నాడియా, నార్త్ 24 పరగణాలు మరియు ఈస్ట్ బుర్ద్వాన్లో జిల్లాలో జరిగే ఈ దశ పోలింగ్ ఫలితాలను ప్రభావితం చేయనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఓటు వేసేందుకు వచ్చిన ప్రజలకు థర్మల్ స్కానింగ్ చేస్తూ, హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. బెంగాల్లో ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), బీజేపీ పార్టీల మధ్యే కీలక పోటీనెలకుంది. కాంగ్రెస్, వామపక్షాల కూటమి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇక బెంగాల్లో ఏడో దశ పోలింగ్ ఏప్రిల్ 27, ఎనిమిదో దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరగనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ