శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు సినీరంగంలో వారియొక్క అనుభవాన్ని ‘పరుచూరి పాఠాలు’ పేరుతో వర్తమాన సినీ రచయితలకు ఉపయోగపడేలా అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా 185వ పాఠంలో దేవా కట్టా దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్, రమ్యకృష్ణ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటించిన “రిపబ్లిక్” సినిమాపై విశ్లేషణ చేశారు. రిపబ్లిక్ సినిమా చాలా గొప్ప సినిమా అని అన్నారు. చట్టం, న్యాయం, రాజకీయం, ప్రజలు వంటి నాలుగు స్తంభాలతో ఏర్పడ్డ ప్రజాస్వామ్యంపై వచ్చిన సినిమాల్లో ఇదొకటని అన్నారు. ఈ సినిమా కథా బీజం, నటీనటుల పెర్ఫార్మన్స్, దర్శకుడు ప్రతిభ గురించి పరుచూరి గోపాలకృష్ణ వివరించారు.
పూర్తి వివరణతో కూడిన వీడియో కోసం స్క్రోల్ చేయండి 👇