భారత్-శ్రీలంక జట్ల మధ్య మూడు టీ20ల సిరీస్ లో భాగంగా గుహవాటిలోని బర్సపర స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. ముందుగా ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలుచుకుని బౌలింగ్ ఎంచుకున్నాడు. మ్యాచ్ మరికొద్దీసేపట్లో ప్రారంభమవుతుందనగా అరగంటకు పైగా భారీ వర్షం కురవడంతో పిచ్ పూర్తిగా తడిసిపోయింది. వర్షం ఆగిపోయిన తర్వాత మైదానం సిబ్బంది గ్రౌండ్ ఆరబెట్టేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పరిస్థితిలో మార్పు కనపడలేదు. మధ్యలో మరొకసారి వర్షం పడడంతో పిచ్, అవుట్ ఫీల్డ్లు మొత్తం చిత్తడిగా తడిచిపోయాయి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ అయినా జరుగుతుందేమో అని అభిమానులు ఎదురుచూశారు, అయితే మూడు వేర్వేరు సమయాల్లో పిచ్ను పరిశీలించిన అంపైర్లు, ఆ తర్వాత మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రెండో టీ20 జనవరి 7న ఇండోర్ లో, అలాగే మూడో టీ20 మ్యాచ్ జనవరి 10న పుణెలో జరగనున్నాయి.
Home స్పోర్ట్స్
- Advertisement -