స్పెయిన్లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ లో భారత షట్లర్స్ దూసుకుపోతున్నారు. తెలుగు స్టార్ పీవీ సింధు రెండో రౌండ్లో స్లావేకియాకు చెందిన తన ప్రత్యర్థి మార్టిన్ రెపిస్కాను 21-7, 21-9 తేడాతో ఓడించి.. కేవలం 24 నిమిషాల్లోనే ఆట ముగించి ప్రీ క్వార్టర్స్కు చేరుకుంది. సింధుతో పాటు కిడాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్ కూడా ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు.
కిడాంబి శ్రీకాంత్ చైనీస్ లీ షి ఫెంగ్ను 15-21, 21-18, 21-17తో ఓడించాడు. జపాన్కు చెందిన కెంటా నిషిమోటోను 22-20, 15-21, 21-18 తేడాతో ఓడించిన లక్ష్యసేన్ మూడో రౌండ్లో చోటు దక్కించుకున్నాడు. ఇక మెన్స్ డబుల్స్లో తాయిపే లీ, యాంగ్ను 27-25, 21-17 ఓడించిన సాత్విక్ సాయిరాజ్, చిరాగ్లు కూడా ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ