ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. యూఏఈలో ఐపీఎల్ 13 వ సీజన్ నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు కూడా అనుమతి ఇవ్వడంతో మిగతా ఏర్పాట్లపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దృష్టి పెట్టింది. ఆదివారం నాడు జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వర్చువల్ సమావేశంలో మ్యాచులు నిర్వహించే వేదికలు, యూఏఈకి వెళ్లే ఫ్రాంచైజీ ఆటగాళ్లను జాబితాను ఖరారు చేశారు.
ఐపీఎల్-2020 వివరాలు:
- ప్రారంభ తేదీ – సెప్టెంబర్ 19
- ఫైనల్స్ – నవంబర్ 10
- మ్యాచులు జరిగే రోజులు – 53
- మ్యాచుల సమయాలు: మధ్యాహ్నం గం.3.30, రాత్రి గం.7.30
- ఒక్కో జట్టు గరిష్ట పరిమితి : 24 మంది ఆటగాళ్లు, అన్ లిమిటెడ-కోవిడ్ సబ్స్టిట్యూట్ లు
- వేదికలు: దుబాయ్, అబుదాబి, షార్జా
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu