తెలంగాణలో రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) ఇప్పటికే ప్రిలిమినరీ రాత పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం పోలీసు ఉద్యోగార్థుల అభ్యర్ధన మేరకు ప్రిలిమినరీ రాత పరీక్షల కటాఫ్ మార్కులను తగ్గించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అసెంబ్లీ వేదికగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ హామీ మేరకు ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్షలో అర్హతకై నిర్ణయించిన కటాఫ్ మార్కులపై జీవోను సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు కొన్ని కేటగిరీల అభ్యర్థుల ప్రిలిమినరీ రాత పరీక్ష క్వాలిఫైయింగ్ మార్కులకు సవరణ చేస్తునట్టు టీఎస్ఎల్పీఆర్బీ తెలిపింది.
కటాఫ్ మార్కులు తగ్గింపు వివరాలు:
ప్రిలిమినరీ రాత పరీక్ష పేపర్లో అర్హత సాధించడానికి అభ్యర్థులు పొందాల్సిన కనీస మార్కులు ఓసీలకు 30 శాతం, బీసీలకు 25 శాతం మరియు ఎస్సీలు/ఎస్టీలు/ఎక్స్-సర్వీస్మెన్ లకు 20 శాతం అని పేర్కొన్నారు. ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 200 మార్కులకు నిర్వహించగా ఓసీ అభ్యర్థులు 60 మార్కులు, బీసీ అభ్యర్థులు 50 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు 40 మార్కులు పొందితే అర్హత సాధించనున్నారు. ఇక కటాఫ్ మార్కులపై ప్రకటన వెలువడడంతో త్వరలోనే ఎస్సై, కానిస్టేబుల్ ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు విడుదల అయ్యే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY