తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ సహా మరికొందరు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈటలతో పాటుగా మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ తులా ఉమ, ఆర్టీసీ కార్మిక నేత అశ్వత్థామరెడ్డి సహా పలువురు నేతలు సోమవారం నాడు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకొని బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కాగా మొత్తం 184 మందితో కూడిన ఈటల బృందం మంగళవారం ఉదయం ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో తిరిగి హైదరాబాద్ కు బయలుదేరింది. ఈ క్రమంలో వారు ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. టేకాప్ అవుతున్న సమయంలో రన్ వే పైనే సాంకేతిక సమస్యను పైలెట్ గుర్తించి అలెర్ట్ అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. సమస్య పరిశీలన అనంతరం గంట ఆలస్యంగా విమానం తిరిగి హైదరాబాద్ కు బయలుదేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ