తెలంగాణ రాష్ట్రంలో మద్యం షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచేందుకు అనుమతి ఇస్తూ ఇటీవలే రాష్ట్ర అబ్కారీ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యం ప్రియులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో A4 షాపులు ఇకపై రాత్రి 8.30 గంటల వరకు అమ్మకాలు జరుపుకోవచ్చని రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. జూన్ 5, శుక్రవారం నాడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
అలాగే గుడుంబా తయారీ, అమ్మకందారులపై కఠీన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇతర రాష్ట్రాల నుండి హైదరాబాద్ కు అక్రమంగా తరలిస్తున్న నల్ల బెల్లం రవాణాను కూడా అరికట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గుడుంబా తయారు, అమ్మకందారులపై పిడి యాక్టు క్రింద కేసులను నమోదు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu