తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనకు వెళ్లనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద నీటిమట్టం 100 ఎఫ్ఆర్ఎల్ కు చేరుకున్న నేపథ్యంలో ప్రాజెక్టును సీఎం కేసీఆర్ సందర్శించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు హెలికాప్టర్లో మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు సీఎం చేరుకుంటారు. బ్యారేజ్ పరిసరాల్లో పర్యటించిన అనంతరం అక్కడే అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. అనంతరం హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం కానున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ