టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కాన్వాయ్లోని వాహనం ప్రమాదానికి గురైంది. విజయవాడ నుంచి హైదరాబాద్ కి వస్తుండగా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు మీద ఆవు ఎదురురావడంతో తప్పించబోయి కాన్వాయ్ లోని ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సడెన్ బ్రేక్ వేసినట్టు తెలుస్తుంది. దీంతో కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి. ఆ వాహన శ్రేణిలో తర్వాతి వాహనంలో ఉన్న చంద్రబాబు క్షేమంగా ఉన్నారు. ఘటన అనంతరం వాహనాల సమస్య వలన చంద్రబాబు కొద్దిసేపు వేచి ఉన్నారు. అనంతరం మళ్లీ కాన్వాయ్ లో హైదరాబాద్కు బయలుదేరినట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu