ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదోతరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ లో మార్పు చోటు చేసుకుంది. ముందుగా పదో తరగతి-2022 పరీక్షలను మే 2 నుంచి మే 13 వరకు నిర్వహించేలా షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం నాడు సవరించిన పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలను ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహించనున్నారు.
ఏపీలో పదో తరగతి-2022 పరీక్షల షెడ్యూల్:
- ఏప్రిల్ 27: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1, ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-1 (కంపోజిట్ కోర్స్)
- ఏప్రిల్ 28: సెకండ్ లాంగ్వేజ్ పేపర్
- ఏప్రిల్ 29: ఇంగ్లీష్ పేపర్
- మే 2: మ్యాథమేటిక్స్ పేపర్
- మే 4: ఫిజికల్ సైన్స్ పేపర్
- మే 5: బయోలాజికల్ సైన్స్ పేపర్
- మే 6: సోషల్ స్టడీస్ పేపర్
- మే 7: ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్-2, ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-1
- మే 9: ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-2, ఎస్ఎస్సీ ఒకేషనల్ కోర్స్ థియరీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ