తెలంగాణ రాష్ట్రంలో బీటెక్, డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. కరోనా నేపథ్యంలో 2020–21 విద్యా సంవత్సరానికి గానూ ఇప్పటికే కొన్ని రోజులు కోల్పోవడంతో కాలేజీ పనిరోజులను నిర్ణయించి, క్లాసులు ప్రారంభంపై యూనివర్సిటీలకు ఆదేశాలు ఇచ్చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తునట్టు సమాచారం. అయితే క్లాసులు ఆన్లైన్ పద్దతిలో నిర్వహిస్తారా లేదా రెగ్యులర్గా కాలేజీల్లోనే నిర్వహిస్తారా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరోవైపు బిటెక్, ఎమ్మెస్సీ, డిగ్రీ సహా ఇతర కోర్సుల్లో కొంత మేర సిలబస్ తగ్గింపు, కాలేజీ పనిరోజులు 180 నుంచి 150 వరకు తగ్గించే అంశాలపై కమిటీ వేసి నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. క్లాసుల ప్రారంభం సహా పలు అంశాలపై ప్రభుత్వ ఆమోదంతో ఉన్నత విద్యామండలి త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ