తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో చేపడుతున్న పాదయాత్ర పదో రోజుకు (సెప్టెంబర్ 6, సోమవారం) చేరుకుంది. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా పదోరోజున ఆయన పాదయాత్ర 100 కి.మీ మైలురాయిని దాటింది. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా మోమిన్పేట్ వద్ద నాయకులు, కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ వంద కిలోల కేక్ కట్ చేశారు. మరోవైపు 100 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా బండి సంజయ్ ట్వీట్ చేస్తూ, యాత్ర విజయవంతం చేస్తున్న తెలంగాణ ప్రజలకు, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ