హైదరాబాద్ నగరంలోని సనత్నగర్ సెయింట్ థెరిస్సా హాస్పిటల్లో టెక్ మహీంద్రా సంస్థ విరాళంతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్ ను మరియు 7 అంబులెన్స్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి నియంత్రణలోనే ఉందని, ప్రస్తుతం రోజువారీ పాజిటివ్ కేసులు వందల్లోనే నమోదు అవుతున్నాయని అన్నారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రక్రియలో కూడా తెలంగాణ ముందు వరుసలో ఉందని చెప్పారు.
అలాగే మహీంద్రా గ్రూప్ తెలంగాణలో ఒకరంగానికే పరిమితం కాలేదని, జహీరాబాద్లో సంవత్సరానికి లక్ష పైచిలుకు ట్రాక్టర్లు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. టెక్ మహీంద్రా హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ లోనే ఉందని, వరంగల్ లో కూడా ఒక క్యాంపస్ ప్రారంభించారని తెలిపారు. ఎడ్యుకేషన్ రంగంలో కూడా తెలంగాణలో మహీంద్రా యూనివర్సిటీని నెలకొల్పారని అన్నారు. ఇలా ఎన్నో రంగాల్లో విస్తరించి, తెలంగాణ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మహీంద్రా అండగా ఉంటుందని చెప్పారు. కరోనాపై పోరులో భాగంగా 7 అంబులెన్స్లను, కోటి రూపాయల విలువైన ఆక్సిజన్ ప్లాంట్ ను సెయింట్ థెరిస్సా హాస్పిటల్ లో ఏర్పాటు చేసిన టెక్ మహీంద్రాగ్రూపుకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ