మూడు టెస్టుల సిరీ్సలో ఓటమి అనంతరం టీమిండియా ఇప్పుడు వన్డే సిరీ్సలో అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో నేటి నుంచి మూడు వన్డేల సిరీస్ జరుగబోతోంది. రోహిత్ గైర్హాజరీలో తొలిసారిగా కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో జట్టు బరిలోకి దిగబోతోంది. త్వరలోనే టెస్టు కెప్టెన్ పదవికి రాహుల్ పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్ అతడికి కీలకం కానుంది. కాగా, వన్డే కెప్టెన్సీకి అనివార్య పరిస్థితిల్లో దూరమైన విరాట్కు కూడా ఈ సిరీ్సలో రాణించడం కీలకమే. చాలా రోజులుగా ఊరిస్తున్న సెంచరీని సాధించాలనే ఆలోచనలో ఉన్నాడు. మరోవైపు పూర్తి స్థాయి వన్డే జట్టుకు ద్రవిడ్ తొలిసారిగా కోచ్గా వ్యవహరించబోతున్నాడు.
టీమిండియాకు ఏడేళ్ల పాటు మైదానంలో నాయకుడిగా విరాట్ కోహ్లీ చూపిన తెగువ, కీలక సమయాల్లో తనదైన దూకుడు ఆటతీరుతో జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఘనచరిత్ర ఉంది. అయితే, వన్డే కెప్టెన్సీ నుంచి అనూహ్యంగా తప్పుకున్న విరాట్ కోహ్లీ ఇప్పుడు జట్టులో కేవలం ఒక ఆటగాడు మాత్రమే. దీంతో నేటి నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీ్సలో అభిమానుల దృష్టంతా అతడిపైనే ఉండబోతోంది. ప్రస్తుతం కెప్టెన్సీ భారం కూడా లేకపోవడంతో విరాట్ మునుపటి ఆటతీరుని ప్రదర్శిస్తాడని అంతా భావిస్తున్నారు. అలాగే కెప్టెన్గా లోకేష్ రాహుల్ నిరూపించుకోవాల్సి ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF