టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమానికి రోజురోజుకి దేశవ్యాప్తంగా మద్ధతు పెరుగుతుంది. ఇప్పటికే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ సూపర్స్టార్, పద్మ విభూషణ్ అమితాబ్ బచ్చన్ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. మంగళవారం నాడు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో అమితాబ్ బచ్చన్ పాల్గొని మొక్కలు నాటారు. అమితాబ్ బచ్చన్ తో పాటుగా ఎంపీ సంతోష్కుమార్, అగ్రనటుడు నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, ఫిల్మ్సిటీ ఎండీ విజయేశ్వరి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు.
గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో అమితాబ్ బచ్చన్ పాల్గొనడం ఆనందంగా ఉందని ఎంపీ సంతోష్ తెలిపారు. ఈ సందర్భంగా వృక్షవేదం పుస్తకాన్ని అమితాబ్ బచ్చన్ కు ఎంపీ సంతోష్ అందజేశారు. అనంతరం అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించడానికి ఎంపీ సంతోష్ చేస్తున్న కృషిని ప్రశంసించారు, భవిష్యత్ తరాలకు ఈ కార్యక్రమం ఖచ్చితంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ