ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీయట్ అడ్మిషన్స్ (ప్రవేశాలు) ఆన్లైన్ విధానం ద్వారానే చేపట్టనున్నట్టు ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాగా 2021-22 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ అడ్మిషన్స్ (ప్రవేశాలకు) సంబంధించి ఇంకా ఎలాంటి నోటిఫికేషన్ జారీచేయలేదని పేర్కొన్నారు. అయితే కొన్ని కాలేజీలు ఆఫ్లైన్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోసం అడ్మిషన్లు చేపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఆఫ్లైన్ లో చేపట్టిన అడ్మిషన్లను ఇంటర్ బోర్డు పరిగణించదని స్పష్టం చేశారు. ఆఫ్లైన్ అడ్మిషన్లు తీసుకుంటున్న ప్రైవేట్ కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్స్ కోసం కేవలం ఆన్లైన్ విధానం ద్వారానే అడ్మిషన్స్ తీసుకోవాలని విద్యార్థులకు ఇంటర్ బోర్డు విజ్ఞప్తి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ