హైదరాబాద్ శివారు మొయినాబాద్ ఫాంహౌస్లో బుధవారం రాత్రి వెలుగుచూసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కీలక మలుపులు తిరుగుతోంది. ఇక ఈ వ్యవహారంలో తెరవెనుక శక్తిగా పనిచేసిందన్న ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజీపీ ఎదురుదాడికి సిద్ధమైంది. ఇది సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన డ్రామా అని, దీనిలో తమకెలాంటి పాత్ర లేదని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. దీనిని ఇక్కడితో వదిలేది లేదని, ఈ వ్యవహారానికి సంబంధించి లోతుగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్లో తమకు సంబంధం లేదని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని సీఎం కేసీఆర్కు బండి సంజయ్ గురువారం సవాల్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే బండి సంజయ్ సవాల్ కు సీఎం కేసీఆర్ స్పందించనప్పటికీ, బండి సంజయ్ మాత్రం చెప్పినట్లే యాదాద్రికి బయలుదేరారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ నుంచి సంజయ్ యాదగిరిగుట్టకు బయల్దేరారు. ఇక ఆయనతో పాటు వెళ్లేందుకు పార్టీ క్యాడర్ కూడా సిద్ధమైంది. పోలీస్లు అడ్డుకున్నా సరే యాదగిరిగుట్టకు వెళ్లి తీరుతామని ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా మరోవైపు బండి సంజయ్ యాదగిరిగుట్ట పర్యటనను అడ్డుకోవాలని టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇరు పార్టీలు ఎదురైతే ఘర్షణ చోటుచేసుకోవచ్చనే ఉద్దేశంతో బండి సంజయ్ యాత్రను పోలీసులు అడ్డుకోవచ్చని సమాచారం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY