మునుగోడు ఉపఎన్నిక ముందు బీజేపీకి మరో షాక్ తగలనుంది. బీజేపీ నేత, పద్మశాలి సంఘ నాయకుడు, మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ త్వరలో బీజేపీకి రాజీనామా చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. ఆదివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యల పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, సీఎంను అభినందించారు.
అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేనేతపై జీఎస్టీ వేయడం పట్ల రాపోలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నేత కుటుంబం నుంచి వచ్చిన తాను బీజేపీ చేస్తున్న ఈ నిర్వాకాన్ని చూస్తూ భరించలేనని, తాను బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతానని రాపోలు ఆనంద భాస్కర్ సీఎం కేసీఆర్ తో చెప్పారు. అలాగే రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని ఆనంద భాస్కర్ కొనియాడారు. భారత రాష్ట్ర సమితి ద్వారా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. ఇప్పటికే స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరగా, తాజాగా రాపోలు కూడా పార్టీ వీడనుండడంతో మునుగోడు ఉపఎన్నికలో బీజేపీపై ఎలాంటి ప్రభావం పడనుందో అనే చర్చ మొదలైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY