తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోనుంది. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సరికొత్త యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దీనిలో భాగంగా శనివారం శంషాబాద్ లోని నోవాటెల్ హోటల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు చెందిన కొంతమంది ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈరోజు వరంగల్ లోని హనుమకొండలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొనేందుకు జేపీ నడ్డా హైదరాబాద్ వస్తున్నారు. ఈ క్రమంలో పలువురు సినీ ప్రముఖులు, రచయితలు అలాగే క్రీడాకారులతో సమావేశమవనున్నారు. అయితే వీరిలో టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నితిన్ నడ్డాతో భేటీ కానుండటం ఆసక్తికర పరిణామం. నితిన్తో కలిసి ఆయన ఈరోజు నోవాటెల్లో డిన్నర్ చేయనున్నారు.
అయితే అంతకుముందు జేపీ నడ్డా మాజీ క్రికెటర్, కెప్టెన్ మిథాలీ రాజ్ను కలవనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. శనివారం మధ్యాహ్నం తొలుత పార్టీ ముఖ్య నేతలతో సమాలోచనలు జరిపి, ఆ తర్వాత క్రికెటర్ మిథాలీ రాజ్తో భేటీ కానున్నారు. అనంతరం వరంగల్ వెళ్లి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని నేరుగా సభకు హాజరు కానున్నారు. సభ అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుని నోవోటెల్లో హీరో నితిన్తో భేటీ అవుతారు. రాజ్ను కలవబోతున్నారు. కాగా ఇటీవలే అమిత్షా జూనియర్ ఎన్టీఆర్ను కలిసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తెలంగాణలో ఇలా ప్రముఖులతో వరుసగా భేటీలు అవడం వెనుక ఆంతర్యం ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. రాజకీయ విశ్లేషకులు బీజేపీ స్ట్రాటజీపై రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలన్న లక్ష్యం దిశగా బీజేపీ అడుగులు వేస్తోందని, దీనిలో భాగంగానే ప్రజలలో పాపులారిటీ ఉన్న ప్రముఖులతో భేటీలు జరుపుతోందని వివరిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY