బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నేడు (ఆగస్టు 27, శనివారం) సాయంత్రం హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో తెలంగాణ బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభకు ముఖ్య అతిథిగా జేపీ నడ్డా హాజరై, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. జేపీ నడ్డా హాజరు కానున్న నేపథ్యంలో ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేలా బీజేపీ నేతలు ఏర్పాట్లు చేశారు. జన సమీకరణ సహా ఇతర అంశాలపై ఆరు నేతలకు బండి సంజయ్ ఇప్పటికే కీలక సూచనలు చేశారు. అలాగే ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను పలువురు రాష్ట్రస్థాయి బీజేపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. పాదయాత్రకు కొన్ని రోజులు ఆటంకం కలగడంతో సత్తా చాటేందుకు ఈసారి జన సమీకరణపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభకు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ గా నియామకం అయిన సునీల్ బన్సల్ తొలిసారిగా తెలంగాణకు చేరుకున్నారు. నేడు హనుమకొండలో జరిగే పాదయాత్ర ముగింపు సభలో సునీల్ బన్సల్ కూడా పాల్గొననున్నారు. ఇక బండి సంజయ్ మూడో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ఆగస్టు 2న యాదాద్రిలో ప్రారంభంకాగా, 22 రోజులపాటుగా కొనసాగి నేడు వరంగల్ భద్రకాళీ ఆలయం వద్ద ముగించనున్నారు.
తెలంగాణలో జేపీ నడ్డా పర్యటన షెడ్యూల్:
- శనివారం ఉదయం 11:45 గంటలకు సతీసమేతంగా జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
- మధ్యాహ్నం 3 గంటలకు వరంగల్ లో భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకోనున్నారు.
- మధ్యాహ్నం 3.30 గంటలకు తెలంగాణ అమరవీరుల కుటుంబాలతో సమావేశం కానున్నారు.
- సాయంత్రం 4.10 గంటలకు హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభకు హాజరు.
- సాయంత్రం 6.50 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలోని నోవాటెల్ హోటల్ లో మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, హీరో నితిన్, పలువురు రైటర్లు, ప్రముఖులతో సమావేశం.
- అనంతరం శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు పయనం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY