గత మూడున్నరేళ్లుగా రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించిన బిశ్వభూషణ్ హరిచందన్కు వీడ్కోలు పలికేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. గవర్నర్ వ్యవస్థకు నిండుతనం తెచ్చిన వ్యక్తి బిశ్వభూషణ్ హరిచందన్ అని కొనియాడారు. తనకున్న అనుభవంతో ఒక కుటుంబ పెద్దలా ఆయన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడ్డారని, ఆయనతో తనకు అనేక తీపి జ్ఞాపకాలు ఉన్నాయని, అవి ఎప్పటికీ మరువలేనివని పేర్కొన్నారు. ఇక బిశ్వభూషణ్ గవర్నర్ కాకమునుపు మంచి విద్యావేత్త అని, న్యాయ నిపుణులని తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని, ఒడిశా బార్ అసోసియేషన్లో కీలకంగా వ్యవహరించారని వివరించారు. రాష్ట్రానికి ఆయన అందించిన సేవలను ఏపీ ప్రజలు మరువరని, వారందరి తరపున ధన్యవాదాలని అన్నారు.
ఇక సీఎం జగన్ ప్రసంగం అనంతరం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, గవర్నర్-సీఎం సంబంధాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. సీఎం జగన్ తన యెడల చూపిన గౌరవం మరువలేనిదని, ఆయనను తన కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నానని చెప్పారు. సీఎం జగన్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అద్భుతమని, ఏపీ తనకు రెండో ఇల్లు వంటిదని, జీవితాంతం ఈ రాష్ట్రాన్ని, ఇక్కడి ప్రజలను మరువనని తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ సలహాదారులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా పలువురు ముఖ్య అధికారులు హాజరయ్యారు. కాగా మరోవైపు గవర్నర్గా నియమితులైన జస్టిస్ (రిటైర్డ్) ఎస్ అబ్దుల్ నజీర్కు స్వాగతం పలికేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కాగా త్వరలోనే కొత్త గవర్నర్ ప్రమాణస్వీకారం చేయనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE