నివర్‌ తుపాన్ కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా : సీఎం జగన్

5 Lakh Ex-gratia to the Deceased due to Nivar Cyclone, AP CM YS Jagan, AP Cyclone Nivar News, AP Government, Cyclone, Cyclone in AP, Cyclone Nivar, Cyclone Nivar hit Andhra Pradesh, Cyclone Nivar live, Cyclone Nivar Live Updates, Cyclone Nivar Tracker, Financial Aid to Nivar Cyclone Affected Farmers, Mango News Telugu, Nivar Cyclone Affected Areas, Nivar Cyclone live updates

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాలపై నివర్ తుఫాన్ ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తుపాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి శనివారం నాడు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోని తుపాను ప్రభావిత ప్రాంతాలను ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వే అనంతరం ఈ మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. నివర్ తుఫాన్ వలన జరిగిన పంట, ఆస్తి నష్టంపై సీఎం వైఎస్ జగన్ కీలకంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, తుఫాను వలన జరిగిన నష్టాన్ని సమగ్రంగా పరిశీలించామని, ప్రతి బాధితుడిని ఆదుకుంటామన్నారు. ఈ తుపాను కారణంగా చిత్తూరు జిల్లాలో ఆరుగురు, కడప జిల్లాలో ఇద్దరు మరణించారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. మృతుల కుటుంబసభ్యులకు రూ.5 లక్షల చొప్పున వెంటనే ఎక్స్‌గ్రేషియాను అందించాలని అధికారులను సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. అలాగే తుఫాన్ ప్రభావంతో పునరావాస శిబిరాల్లో ఉన్నవారికి కూడా రూ.500 అందించాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ సూచించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =