కరోనా నియంత్రణ చర్యలపై పర్యవేక్షణ చేసేందుకు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వం పంపించిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ (ఐఎంసీటి) హైదరాబాద్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. జలశక్తి విభాగం అదనపు కార్యదర్శి అరుణ్ భరోక నేతృత్వంలోని కేంద్ర బృందం మే 2, శనివారం నాడు ఎర్రగడ్డలోని ఇ.ఎస్.ఐ ఆసుపత్రిని సందర్శించింది. ఈ సందర్భంగా డీన్ డా.శ్రీనివాస్, సూపరింటెండెంట్ డా.పాల్, ఇతర వైధ్యాధికారులతో కలిసి ఇ.ఎస్.ఐ ఆసుపత్రిలోని వసతులను పరిశీలించారు. కోవిడ్-19 పాజిటీవ్ కేసులకు వైద్య సేవలు అందించుటకు చేసిన ఏర్పాట్ల గురించి వాకబు చేశారు. అయితే డీన్ డా.శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంత వరకు పాజిటీవ్ కేసులు ఈ ఆసుపత్రికి రాలేదని వెల్లడించారు.
అనంతరం చర్లపల్లిలోని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాంను కేంద్ర బృందం పరిశీలించింది. బియ్యం నిల్వల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ బృందంలో కేంద్ర ప్రజారోగ్యశాఖ సీనియర్ వైద్యులు డా.చంద్రశేఖర్ గెడం, జాతీయ పోషకాహర సంస్థ డైరెక్టర్ డా.హేమలత, వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్.ఠాకూర్, జాతీయ విపత్తు నివారణ సంస్థ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేదిలు ఉన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu