కోవిడ్-19 మరియు మధ్యాహ్నం భోజన కార్యక్రమానికి సంబంధించిన అంశాలపై చర్చించడానికి కేంద్ర హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్రా అన్ని రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులతో ఏప్రిల్ 28, మంగళవారం నాడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ తరపున విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పాల్గొని ఈ లాక్డౌన్ సమయంలో విద్యార్థులు, విద్యారంగం పట్ల ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు. అలాగే రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేశారు.
లాక్డౌన్ ముగిసాక రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని, ఆ మేరకు ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. లాక్డౌన్ పూర్తైన రెండు వారాల తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో విడుదల చేసే అవకాశముందని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా హెచ్ఆర్డి మంత్రి రమేశ్ పోఖ్రియాల్కు ఆదిమూలపు సురేశ్ తెలియజేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ పదోతరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయనున్నామని మంత్రి సురేష్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu