తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు 25వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ తనయుడు, అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులర్పించారు. అలాగే టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ సహా పలువురు ప్రముఖులు, రెండు రాష్ట్రాలలోని పలు ప్రాంతాల నుంచి నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఎన్టీఆర్ యుగపురుషుడని, ఆయన సృష్టించిన చరిత్ర భవిష్యత్ లో కూడా ఎవరూ సృష్టించలేరని అన్నారు. పార్టీపెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చిన చరిత్ర ప్రపంచంలోనే ఎక్కడా జరగలేదన్నారు. దేశంలో రాజకీయాలకే ఎన్టీఆర్ వన్నెతెచ్చారని అన్నారు. ఎప్పటికైనా ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని, ఇప్పటికే ఆలస్యం అయిందని చెప్పారు. ఎన్టీఆర్ కు భారతరత్న సాధించేంతవరకూ పోరాడతామని చంద్రబాబు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ