ఈనెల 21న ఎల్బీస్టేడియంలో క్రిస్మస్ విందు, తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం: మంత్రి కొప్పుల

Christmas Dinner Event to be Held at LB Stadium on 21st December Minister Koppula Eshwar,Christmas Dinner Event,Christmas Dinner at LB Stadium,Telangana Govt Christmas Dinner,Mango News,Mango News Telugu,Minister Koppula Eshwar,Christmas Celebrations,Dinner For Christians At Lb Stadium,Mango News,Mango News Telugu,Telnagana Government Intention,People Celebrate The Festivals Happily, Minister Talasani Presented Christmas Gifts,Cm Kcr News And Live Updates,Telangana CM KCR,

రాష్ట్రంలో సబ్బండ వర్గాల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం ఎస్ఆర్ గార్డెన్ లో క్రైస్తవులకు గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి కొప్పుల మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సర్వమతాలను గౌరవిస్తూ వాటికి సముచిత స్థానం కల్పిస్తున్నదని అన్నారు. తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సమన్యాయం చేస్తున్నారని, ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తున్నారని అన్నారు.

ఈనెల 21న ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ విందు:

ఈనెల 21వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో క్రైస్తవ సోదరి సోదరీమణులకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్‌ క్రిస్మస్ విందు ఇస్తారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. క్రిస్మస్‌ వేడుకలను పేదలు ఘనంగా జరుపుకునేలా ప్రభుత్వం గిఫ్ట్‌ ప్యాక్‌ లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు సారె పంపిణీ చేస్తున్నట్టుగానే రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలకూ దుస్తులు అందిస్తున్నట్లు చెప్పారు. ధర్మపురి నియోజకవర్గంలో 4,000 కుటుంబాలకు అందజేస్తున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + fifteen =