తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు డిసెంబర్ 7, సోమవారం నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అన్ని కాలేజీలు సిద్ధంగా ఉండాలని డిగ్రీ ఆన్ లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాక రెగ్యులర్ తరగతుల నిర్వహణపై ప్రకటన చేస్తామని చెప్పారు. డిగ్రీ కోర్సుకు సంబంధించి విద్యాక్యాలెండర్ కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు.
మరోవైపు దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్లో 28,136 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చారని, అందులో 27,365 మంది విద్యారులకు సీట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఈ ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా సీట్లు కేటాయించబడిన విద్యార్థులంతా డిసెంబర్ 8 లోపు ఆన్ లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, అంతకు ముందు సీట్లు పొందిన విద్యార్థులు కూడా ఆ తేదీ లోపే సంబంధిత కాలేజీల్లో ఫిజికల్ గా రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఇక గడువు లోపల కాలేజీల్లో రిపోర్టు చేయని విద్యార్థులు సీట్లు కోల్పోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ