దేశంలో వంట గ్యాస్ సిలిండర్ల ధరలు మరోసారి పెరగడంతో వినియోగదారులపై మరింత భారం పడనుంది. ప్రభుత్వ యాజమాన్యంలో నడిచే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ మరియు కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. 14.2 కిలోల డొమెస్టిక్ (గృహ అవసరాలకు) ఎల్పీజీ సిలిండర్లపై రూ.50, 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.350.50 ధర పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సవరించిన ధరలు అన్ని మెట్రో నగరాల్లో నేటి నుంచే (మార్చి 1, బుధవారం) అమల్లోకి రానున్నాయి.
తాజా పెంపుతో ఢిల్లీలో డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధర రూ.1103కు, కమర్షియల్ ధర రూ.2119.50కి పెరిగింది. కమర్షియల్ సిలిండర్ల ధర ముంబయిలో రూ.2071కు, చెన్నైలో రూ.2268కు, కోల్కతాలో రూ.2221 కు పెరిగింది. ఇక తెలంగాణలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.1155కు, ఆంధ్రప్రదేశ్ లో రూ.1161కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు దేశీయ ఎల్పీజీ ధరలను కూడా ప్రభావితం చేస్తున్నాయి. డొమెస్టిక్ సిలిండర్ల ధర పెంపు చివరిసారిగా 2022లో జరగగా, కమర్షియల్ సిలిండర్ ధరను చివరిగా ఈ ఏడాది జనవరి 1వ తేదీన రూ.25 పెంచుతూ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE