తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా గురువారం సభలో జరిగిన పల్లె ప్రగతిపై స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో త్వరలోనే పల్లె దవాఖానలు ప్రారంభిస్తామని ప్రకటన చేశారు. రాష్ట్రంలో హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం, భవిష్యత్ లో కూడా కరోనా, స్వైన్ ఫ్లూ, ఇతర వైరస్ లు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ప్రజలను కాపాడుకోవడం కోసం పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలోనే ఈ దవాఖానలు వస్తాయని, అందుకోసం అన్ని ఏర్పాట్లు జరిగాయన్నారు.
కొద్ది రోజుల్లోనే ప్రారంభమయ్యే ఈ దవాఖానాల కోసం సంబంధిత శాఖలు అన్ని చర్యలు తీసుకుంటున్నాయని చెప్పారు. పేద ప్రజలకు సేవలు అందించడం కోసం అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. మరోవైపు హైదరాబాద్ నగరంలో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని టార్గెట్ పెట్టుకుంటున్నామని చెప్పారు. డివిజన్కు రెండు చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని, కొన్ని బస్తీల్లో ప్రజలు ఎక్కువ ఉన్నచోట మూడు పెట్టాలని సూచించినట్టు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ