దసరా పండుగ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోందని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. గన్నవరంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నామని చెప్పారు. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. ఇదే అదునుగా అధిక ధరలు వసూలు చేసే ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం రేపు ప్రత్యేక వాట్సాప్ నంబర్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఆన్లైన్ టిక్కెట్లపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంటుందని పేర్ని నాని వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ