తెలంగాణ సీఎం కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జవాన్ల త్యాగాలను కించపరిచేలా మాట్లాడటం దేశద్రోహమని బండి సంజయ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ దేశంపై మూడేళ్ళ క్రితం మన సైనికులు సర్జికల్ స్ట్రైక్స్ చేశారని.. ఇది ప్రపంచమంతా నమ్ముతోందని సంజయ్ తెలిపారు. కానీ, దేశంలోని విపక్ష పార్టీలు, నాయకులు మాత్రం దీనిని నమ్మడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడటం సరికాదన్నారు బండి సంజయ్.
సర్జికల్ స్ట్రైక్స్పై మిలిటరీని, ప్రధాని మాటలను సీఎం కేసీఆర్ నమ్మడం లేదని, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహర్ చెబితే నమ్ముతారేమో అని సంజయ్ ఎద్దేవా చేశారు. భారత సైన్యాన్ని అనుమానిస్తోన్న కేసీఆర్ ఏ దేశానికి మద్దతు పలుకుతున్నారో తెలియజేయాలని సంజయ్ డిమాండ్ చేశారు. సైనికుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడిన కేసీఆర్ దేశ ప్రజలకు, సైనికులకు క్షమాపణ చెప్పాలని సంజయ్ మండిపడ్డారు. అలాగే, ప్రధాని మోదీ వచ్చాకే రాష్ట్రాలకు ఇచ్చే నిధుల్ని 32 నుంచి 42 శాతం పెంచిన విషయాన్ని బండి గుర్తు చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ