నేడు షాద్‌నగర్‌లో ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్న వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల

YSRTP Chief YS Sharmila To Hold Nirudyoga Nirahara Deeksha at Shadnagar Constituency Today, YSRTP Chief YS Sharmila , Nirudyoga Nirahara Deeksha at Shadnagar, Nirudyoga Nirahara Deeksha , Shadnagar Constituency, YSRTP Nirudyoga Nirahara Deeksha, YS Sharmila Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief Nirudyoga Nirahara Deeksha, Mango News , Mango News Telugu, YSRTP Nirudyoga Nirahara Deeksha, YSRTP Chief YS Sharmila , YS Sharmila Latest News And Updates

తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పట్టుదలగా ఉంది. దీనిలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను గుర్తించేందుకు చేపట్టిన పాదయాత్ర ఇప్పటికే 2వేల కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగం మరియు రైతుల సమస్యలపై ఆమె తన గళాన్ని వినిపిస్తున్నారు. ఒకవైపు పాదయాత్ర చేస్తూనే మరోవైపు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆయా సమస్యలపై షర్మిల వారం వారం దీక్షలు చేపడుతున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగులకు మద్దతుగా ఆమె దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యోగాల నోటిఫికేషన్‌ కోరుతూ వైఎస్ షర్మిల మంగళవారం ‘నిరుద్యోగ నిరాహార దీక్ష’ చేపట్టనున్నారు. కాగా ప్రస్తుతం ఆమె పాదయాత్ర షాద్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతోంది. మంగళవారం కొండుర్గ్ మండల కేంద్రంలో మధ్యాహ్నం నుంచి ప్రారంభమవనున్న దీక్ష సాయంత్రం వరకూ కొనసాగనుంది. ఇక దీక్ష అనంతరం లాల్ పహాడ్ గ్రామం మీదుగా పాదయాత్ర కొనసాగుతుందని వైఎస్సార్టీపీ ప్రకటించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 − one =