హుజూర్నగర్ ఉప ఎన్నికలలో ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఘనవిజయం అందించిన నేపథ్యంలో అక్టోబర్ 26, శనివారం నాడు సాయంత్రం టిఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు హుజూర్నగర్ లో కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. ఈ సభలో నియోజకవర్గ ప్రజలపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. మంత్రి జగదీష్ రెడ్డి, నియోజక వర్గ ఎమ్మెల్యే సైదిరెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు, టిఆర్ఎస్ నాయకులు ఈ సభలో పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ వరాలు:
- సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి హుజూర్నగర్ మున్సిపాలిటీకి రూ.25 కోట్లు మంజూరు
- నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ.15 కోట్లు కేటాయింపు
- నియోజక వర్గంలో 134 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు విడుదల
- నియోజక వర్గంలో ప్రతి మండల కేంద్రం అభివృద్ధికి రూ.30 లక్షలు మంజూరు
- హుజూర్నగర్ను రెవెన్యూ డివిజన్గా అప్గ్రేడ్ చేయడం
- హుజూర్నగర్లో బంజారా భవన్ ఏర్పాటు
- గిరిజన ఆశ్రమ పాఠశాల ఏర్పాటు
- హుజూర్నగర్లో కోర్టు ఏర్పాటు
- నియోజకవర్గానికి ఎక్కువ శాతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు
- ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కేంద్రంతో చర్చలు
- పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు నిర్ణయం
[subscribe]
Telangana CM KCR Huge Convoy To Huzurnagar Meeting | KCR Latest News | Mango News
02:39
Minister Jagadish Reddy Slams Congress Over Blaming TRS Party | Saidi Reddy Press Meet | Mango News
10:03
TRS MLA Saidi Reddy Speaks To Media After His Victory In Huzur Nagar By Elections | Mango News
03:58
Revanth Reddy Responds Over Congress Defeat In Huzur Nagar By Elections | Telangana Political News
07:16