రాష్ట్రంలోని రైతులను కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా రైతు ఉద్యమం చేద్దామని ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో జరుగుతున్న టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పలు కీలక విషయాలపై సీఎం కేసీఆర్ మాట్లాడారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఉద్యమించేందుకు పార్టీ నాయకులు సిద్ధమవ్వాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ సందర్భంగా.. పంజాబ్ రైతులు దేశ రాజధాని ఢిల్లీలో తలపెట్టిన రైతు ఉద్యమాన్ని ప్రస్తావించారు. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల రైతులు కేంద్ర తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా సంవత్సరం కాలం పైగా అసమాన పోరాటం చేశారని, చివరికి ఫలితం సాధించారని గుర్తు చేశారు. వారిలాగే మనం కూడా రైతు ఉద్యమం చేద్దామని, తెలంగాణ రైతుల హక్కుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు.
దీనిలో భాగంగా ఈనెల 24,25 తేదీల్లో ఆందోళనలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పార్టీ క్యాడర్ కి పిలుపునిచ్చారు. వరితోపాటు ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఒక స్పష్టమైన కార్యచరణ రూపొందించనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తుందని, దీనిపై పార్లమెంట్లో ఎంపీలు కూడా ప్రశ్నించాలన్నారు. విభజన చట్టం హామీల అమలులో మోదీ సర్కార్ విఫలమైందని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వర్రావు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా స్థాయి నాయకులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ