తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జన్మదిన సంబరాలను మూడు రోజుల పాటుగా ఘనంగా నిర్వహించుకుందామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర సాకారం చేసి, సాధించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని, వరుసగా 15,16,17 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ కోరారు. ఎవరికి తోచిన మేరకు వారు తమ సేవా దృక్పథాన్ని చాటుకునేల ఈ సంబరాలు ఉండాలని కేటీఆర్ అన్నారు.
ఫిబ్రవరి 15వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలని, ఇందులో భాగంగా రాష్ట్రంలో ఉన్న ఆసుపత్రులు, వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాల వంటి చోట్ల పండ్ల పంపిణీ, ఆహార పంపిణీ, దుస్తుల పంపిణీ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించాలని సూచించారు. ఫిబ్రవరి 16 తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, ఫిబ్రవరి 17వ తేదీ సీఎం కేసీఆర్ జన్మదినం రోజున రాష్ట్రవ్యాప్తంగా సర్వమత ప్రార్థనలు, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. అలాగే ఈ మూడు రోజులపాటు ఇవే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త తనకు తోచిన విధంగా ఇతరులకు సహాయ పడేందుకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమ తమ స్థాయిలో ఏ సేవా కార్యక్రమాన్ని అయినా చేపట్టవచ్చని కేటీఆర్ కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ