దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచుతున్న గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేఖంగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సీఎం కేసీఆర్ తెలిపారు.
హద్దూ పద్దు లేకుండా కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుకుంటూ పోతుందని, సామాన్య ప్రజలపై భారం పడుతున్న నేపథ్యంలో ధరల పెంపుపై నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారని టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పిలుపుతో అన్ని నియోజకవర్గాల్లో బుధవారం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ