ప్రముఖ సాహితీ వేత్త, ఆధ్యాత్మిక వేత్త, అష్టావధాని అష్టకాల నృసింహరామశర్మ (80) మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు. ఆధ్యాత్మిక, సాహితీ వేత్తగా ఆయా రంగాలకు అష్టకాల నృసింహరామశర్మ చేసిన సేవలు చిరస్మరణీయమని సీఎం అన్నారు. అష్టకాల ఆధ్మాత్మిక, సాహిత్య కృషి సిద్దిపేట ప్రాంత కీర్తి ప్రతిష్టలను మరింతగా ఇనుమడింపచేశాయన్నారు. వారితో తనకున్న అనుబంధాన్ని సీఎం ఈ సందర్భంగా స్మరించుకున్నారు, వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా అష్టకాల నృసింహరామశర్మ గురువారం ఉదయం గుండెపోటుకు గురవడంతో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE