సింగరేణిని ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ కుట్రను భగ్నం చేస్తామని, వారి ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్. శాసనసభలో జరుగుతున్న బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. సింగరేణి బొగ్గు గనుల విషయంలో ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులకు సీఎం కేసీఆర్ ఇప్పటికే లేఖలు రాశారని, నాలుగు బొగ్గు గనులు తెలంగాణకు కేటాయించాలని కోరారని తెలిపారు. అయితే కేంద్రం దీనికి సమాధానంగా ఆ నాలుగు బొగ్గు గనులను వేలం వేస్తున్నామని, కావాలంటే వేలంలో పాల్గొని సొంతం చేసుకోవచ్చని చెప్పిందని వెల్లడించారు. దీంతో కేంద్రం ఉద్దేశాలు ఏంటో అర్ధమయ్యాయని చెప్పిన మంత్రి కేటీఆర్.. నేడు సభ ద్వారా సింగరేణి కార్మికులందరికీ మాటిస్తున్నామని, అవసరమైతే దీనికోసం ఎంత దూరమైనా పోతామని స్పష్టం చేశారు.
సింగరేణి కార్మికుల సహకారంతో, అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఉద్యమం చేపడతామని, తద్వారా కేంద్రం మెడలు వంచి సింగరేణిని కాపాడుకుంటామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇక తొలినుంచి తెలంగాణపై పక్షపాత ధోరణి అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వం బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, స్టీల్ నిక్షేపాలు లేవని కేంద్ర మంత్రి అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. ఇటీవల దావోస్ కేంద్రంగా జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో జిందాల్, మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలతో ప్రాథమికంగా సంప్రదింపులు ప్రారంభించామని, ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం ముందుకు రాకపోతే ప్రైవేటు రంగం ద్వారా లేదా సింగరేణి సంస్థ ద్వారానైనా బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇసుక ద్వారా ప్రస్తుతం ఏడాదికి రూ. 800 కోట్ల ఆదాయం రాష్ట్ర ఖజానాకు సమకూరుతోందని, మన దగ్గర అవలంబిస్తున్న ఇసుక పాలసీని ఇతర రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి అధ్యయనం చేసి వెళ్తున్నారని కేటీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE