ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో 52 కేజీలు విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణపతకం సాధించింది. ప్రపంచ మహిళల బాక్సింగ్లో భారత్ తరపున స్వర్ణం సాధించిన ఐదో బాక్సర్గా నిలవడమే కాకుండా, తెలుగు రాష్ట్రాల నుంచి స్వర్ణం పతకం గెలిచిన తొలి బాక్సర్గా నిఖత్ జరీన్ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని నిజామాబాద్ కు చెందిన నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో విశ్వవిజేతగా నిలవడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. బంగారు పతకాన్ని సాధించిన జరీన్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదిక మీద ఎగరేసిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ను సీఎం మనస్ఫూర్తిగా అభినందించారు.
ప్రభుత్వ ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకుని నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో విశ్వ విజేతగా నిలవడం గర్వించదగిన విషయమని సీఎం అన్నారు. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నదని, తెలంగాణలోని ప్రతీ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి, యువ క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టిందని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF