త్యాగనిరతికి, సహనానికి ప్రతీక మొహర్రం పండుగ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. త్యాగాలకు ప్రతీకగా సాగే ’పీర్ల‘ ఊరేగింపును తెలంగాణ వ్యాప్తంగా ముస్లింలు ఘనంగా జరుపుకుంటారని వెల్లడించారు. అలాగే ముస్లింలతో పాటుగా పలువురు హిందువులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. మతాలకు అతీతంగా హిందూ, ముస్లింల ఐక్యతను, సఖ్యతను గంగా జమునా తెహజీబ్ను ఈ మొహర్రం చాటిచెప్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మానవత్వాన్ని చాటుతూ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఉండాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్లో సీఎం సందేశాన్ని పోస్ట్ చేసింది.
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక!
రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు, హిందువులూ కలిసి నిర్వహించే ‘పీర్ల’ ఊరేగింపు తెలంగాణ ప్రజలమధ్య సఖ్యతను, ఐక్యతను, గంగా-జమునా తెహజీబ్ ను చూపే సందర్భం!#Muharram pic.twitter.com/bRVcaQrbN7
— Telangana CMO (@TelanganaCMO) August 9, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY