టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన నవంబర్ 16, మంగళవారం సాయంత్రం 4 గంటలకు తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంభిస్తుందని, అలాగే తెలంగాణ రైతులను, ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న తీరుతెన్నుల మీద చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించే దిశగా టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనున్నట్టు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ