ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం మరోసారి తెలంగాణలో చర్చనీయాంశం అవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అరెస్టు చేసిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన 3,000 పేజీల ఛార్జిషీట్లో ఈడీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కవితను ఉద్దేశిస్తూ ‘లిక్కర్ క్వీన్’ అని చేసిన ట్వీట్కు ఆమె స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మణిక్కం ఠాగూర్ కూడా దీనిపై స్పందిస్తూ.. కవిత చాలా వివరణలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు తనపై జరుపుతోన్న ట్వీట్ వార్కు ఎమ్మెల్సీ కవిత అదే రీతిలో బదులిచ్చారు. ఈ మేరకు ఆమె తన ట్విట్టర్ ద్వారా.. ‘రాజగోపాల్ అన్నా.. తొందర పడకు, మాట జారకు. ఈ విషయంలో నా పేరు 28 సార్లు చెప్పించినా, లేదంటే 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదు’ అని కౌంటర్ ఇచ్చారు.
రాజగోపాల్ అన్న ..
తొందరపడకు , మాట జారకు !!
” 28 సార్లు ” నా పేరు చెప్పించినా
” 28 వేల సార్లు ” నా పేరు చెప్పించినా
అబద్ధం నిజం కాదు.. #TruthWillPrevail https://t.co/476lW6fOTC— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 21, 2022
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ