తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 7వ తేదీ నుండి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ కు ఆమోదం తెలిపేందుకు మార్చి 6, ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రగతిభవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇక మార్చి 7వ తేదీన ప్రారంభం కానున్న బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు సమావేశాలు ప్రారంభమయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి, సభను ఎన్ని రోజులు నిర్వహించేలా విషయంతో పాటుగా సమావేశాల పూర్తి ఎజెండాను ఖరారు చేయనున్నారు.
ముందుగా రాష్ట్ర వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడం కోసం సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంఓ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ