తెలంగాణ రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి(పీసీసీఎఫ్)గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్.శోభ సోమవారం నాడు పదవీవిరమణ పొందారు. ఈ నేపథ్యంలో ఆర్.శోభను ప్రభుత్వ సలహాదారుగా (అటవీ వ్యవహారాలు) నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ సలహాదారుగా ఆమె రెండేళ్ల పాటు కొనసాగనున్నారు. ఈ రోజు జరిగిన ఆర్.శోభ పదవీ విరమణ, సన్మాన కార్యక్రమంలో, ప్రభుత్వ సలహాదారుగా ఆమె నియామకాన్ని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ప్రకటించి, అభినందనలు తెలియజేశారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర పీసీసీఎఫ్ గా సీనియర్ ఐ.ఎఫ్.ఎస్ అధికారి రాకేష్ మోహన్ డోబ్రియల్ ను ప్రభుత్వం నియమించింది. తెలంగాణకు హరితహారం స్టేట్ నోడల్ ఆఫీసర్ గా గత ఆరేళ్లుగా డోబ్రియల్ పనిచేస్తున్నారు. ప్రస్తుతం పీసీసీఎఫ్ గా ఉన్న ఆర్.శోభ పదవీ విరమణ పొందటంతో డోబ్రియల్ కు పీసీసీఎఫ్ గా, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ గా పూర్తి అదనపు బాధ్యతలు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ