తెలంగాణ రాష్ట్రంలో మరో 472 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అవ్వడంతో డిసెంబర్ 26, శనివారం రాత్రి 8 గంటల నాటికీ మొత్తం కేసుల సంఖ్య 2,84,863 కి చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. కరోనా వలన ఇద్దరు మరణించడంతో రాష్ట్రంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 1531 కి పెరిగినట్టు తెలిపారు. కాగా మరణాల రేటు 0.53 శాతంగా ఉంది.
కరోనా నుంచి కొత్తగా 509 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు రికవరీ అయినవారి సంఖ్య 2,76,753 కి చేరింది. రాష్ట్రంలో కరోనా రికవరీ శాతం 97.15 శాతంగా ఉంది. ఇక ప్రస్తుతం 6,579 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 106, మేడ్చల్ లో 45, రంగారెడ్డిలో 44, నల్గొండలో 23, మంచిర్యాలలో 19, వరంగల్ అర్బన్ లో 18, కరీంనగర్ లో 17, సిద్దిపేటలో 17, ఖమ్మంలో 16, భద్రాద్రి కొత్తగూడెంలో 15 నమోదయ్యాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ