తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 14,2022 నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్టు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముందుగా బండి సంజయ్ ఆగస్టు 28, 20211న తొలిదశ పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. అనంతరం అక్టోబరు 2, 2021న హుస్నాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభతో తొలిదశ పాదయాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 14 నుండి జోగులాంబ గద్వాల్ నుంచి రెండో విడత పాదయాత్ర చేపట్టనున్నట్టు తెలిపారు. ఈ పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ప్రజలతో మమేకమవుతూ, స్థానిక సమస్యలు తెలుసుకోనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ