తెలంగాణలో అత్యంత కీలకమైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలయింది. మరికొద్ది గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈవీఎమ్లను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇక పోలింగ్ ఘట్టం మాత్రమే మిగిలివుంది. అయితే కొన్ని గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా.. ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు ఓటర్ స్లిప్పులు అందలేదు. అధికారులు పంపిణీ చేస్తున్నప్పటికీ చాలా చోట్ల స్లిప్పులు ఇంకా అందలేదు.
ఎన్నికలవేళ ఓటరు స్లిప్పు ఓటర్లకు ఊతకర్రలా పని చేస్తుంది. ఎక్కడికి వెళ్లి ఓటు వేయాలి.. బూత్ నంబర్ వంటి వివరాలు ఓటర్ స్లిప్పుపై ఉంటాయి. అయితే ఓటర్ స్లిప్పులు ఇంకా పంపిణీ చేయకపోవడంతో.. ఓటర్లలో ఆందోళన నెలకొంది. ఓటరు స్లిప్పు లేకుండా.. పోలింగ్ బూత్ ఎక్కడో తెలియకుండా ఓటు వేసేది ఎలా అని ఓటర్లు అయోమయంలో పడ్డారు. అయితే ఇకపై ఆ అయోమయం అవసరం` లేదు. ఎందుకంటే ఓటర్ స్లిప్పు లేకుండా కూడా ఓటు వేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి వెళ్లి పోలింగ్ బూత్ ఎక్కడో చెక్ చేసుకోవచ్చు.
పోలింగ్ కేంద్రాల వివరాల కోసం ఎన్నికల సంఘం టోల్ ఫ్రీ నెంబర్లను తీసుకొచ్చింది. ఓటరు స్లిప్పులు అందని వారు..పోలింగ్ బూత్ వివరాల కోసం 1950, 28082, 92117 నంబర్లకు ఓటర్ ఐడీ నంబర్ను మెసేజ్ చేయాలి. ఆ తర్వాత పోలింగ్ బూత్ వివరాలు ఫోన్కి మెసేజ్ రూపంలో వస్తాయి. 1950 నంబర్కు ఫోన్ చేసి కూడా పోలింగ్ బూత్ వివరాలను తెలుసుకోవచ్చు. ఈ నంబర్లు కేవలం ఎన్నికల వరకు మాత్రమే.. అంటే 24 గంటలు మాత్రమే పని చేస్తాయి.
అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియన్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి కూడా వివరాలను తెలుసుకోవచ్చు. www.ceotelangana.nic.in వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్ ఐడీ నంబర్ ఎంటర్ చేస్తే పోలింగ్ బూత్ వివరాలు వస్తాయి. పోలింగ్ బూత్ ఫొటోలతో పాటు గూగుల్ మ్యాప్ లింక్ను కూడా వెబ్సైట్ ద్వారా పొందవచ్చు. అంతేకాకుండా ఓటర్ హెల్ప్లైన్ యాప్లో కూడా పోలింగ్ బూత్ వివరాలను తెలుసుకోవచ్చు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE