తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నాడు సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వద్ద నిర్మించిన సంగారెడ్డి కెనాల్ నుంచి వర్గల్ మండలం అవుసనిపల్లి గ్రామం వద్ద గల హల్దీ వాగులోకి గోదావరి జలాలను విడుదల చేశారు. హల్దీ వాగులోకి మొత్తం 1600 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో సిద్ధిపేట, మెదక్ జిల్లాల పరిధిలో వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. అలాగే మర్కూక్ మండలంలోని పాములపర్తి గ్రామంలో గోదావరి జలాలను గజ్వేల్ కెనాల్ లోకి సీఎం కేసీఆర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో సీఎం కేసీఆర్ తో పాటుగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ